ఆంధ్ర ప్రదేశ్
గోదావరిలో 8 మంది గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కమినిలంకలో విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా మిగితా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. లభ్యమైన మృతదేహం రాజేష్దిగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో బాధితుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.