అంతర్జాతీయం

Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు

Himanta Biswa Sarma: గురిచూసి కొట్టడంలో అసోం సీఎం హిమంత బిస్వా శర్మను మించినవారుండరు. ఆయన రాజకీయం అలాగే ఉంటుంది. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నా ఆయన అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోయారు. బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీకి ఆయన మౌత్ పీస్ అయ్యారు. దేశంలోనే బలమైన ముఖ్యమంత్రులుగా పేరు సంపాదించిన హిమంత, ఈశాన్య రాష్ట్రాల్లో కీలక నేతగా ఎదిగారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇచ్చే కౌంటర్లకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.

అయితే ఇటీవల బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు చేసిన వ్యాఖ్యలకు హిమంత కౌంటర్ దిమ్మతిరిగిపోయేలా ఉండటమే కాదు, దేశానికి కూడా దిశా నిర్దేశం చేసేలా ఉంది. తాజాగా బిస్వా ఇండియా సంగతి ఇండియా చూసుకుంటుంది. ముందు మీ సంగతి చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. చికెన్స్ నెక్‌ను అందుతున్న సాంకేతికతో మరింత పటిష్టంగా మార్చాలని కూడా సూచించిన హిమాంత, ఇండియాకు ఒక చికెన్ నెక్‌తో సమస్య ఉంటే బంగ్లాదేశ్‌కు ఇలాంటివి రెండున్నాయన్నాడు.

చికెన్ నెక్ కారిడార్‎పై భారతదేశాన్ని అలవాటుగా బెదిరించడాన్ని పట్టించుకోవాల్సిన పనిలేదన్నాడు హిమంత. ఇండియాతో పోల్చినప్పుడు బంగ్లాదేశ్‌లో రెండు ఇరుకైన భూములు ఉన్నాయని అవి చాలా ప్రమాదకరమైన పరిస్థితులో ఉన్నాయని, ముందుగా ఇండియా గురించి కామెంట్ చేసేది బదులు వాటి సంగతి చూసుకోవాలని హెచ్చరించారు.

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని ఇరుకైన భూమి చికెన్స్ నెక్ గురించి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్, చైనాకు వెళ్లి, అక్కడి పాలకులను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన కామెంట్స్ అర్థరహితమైనవని ఇప్పటికే హిమంత బిస్వా శర్మ స్పష్టం చేశారు. దాంతో చికెన్స్ నెక్ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్ మొదటి చికెన్ నెక్, దఖిన్ దినాజ్‌పూర్ నైరుతి గారో హిల్స్ మధ్య 80 కిలోమీటర్ల పొడవైన ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్ ఉందని హిమంత అన్నారు.

ఇక్కడ ఏదైనా అంతరాయం ఏర్పడితే మొత్తం రంగ్‌పూర్ డివిజన్‌ను మిగిలిన బంగ్లాదేశ్ నుండి పూర్తిగా వేరు చేస్తుందని Xలో పోస్ట్‌లో రాశారు. దీనికి సంబంధించి మ్యాప్‌ను ఆయన షేర్ చేశారు. రెండోది దక్షిణ త్రిపుర నుండి బంగాళాఖాతం వరకు 28 కిలోమీటర్ల పొడవైన చిట్టగాంగ్ కారిడార్ అని ఆయన అన్నారు. భారతదేశ చికెన్ నెక్ కంటే చిన్నదైన ఈ కారిడార్ బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని, రాజకీయ రాజధాని మధ్య ఏకైక లింక్ అని అన్నారు. భారతదేశంలోని సిలిగురి కారిడార్ లాగే బంగ్లాదేశ్‌కు రెండు ఇరుకైన కారిడార్లతో ముడిపడి ఉందని శర్మ అన్నారు.

కొందరు మరచిపోయే అవకాశం ఉన్న భౌగోళిక వాస్తవాలను మాత్రమే నేను ప్రయత్నిస్తున్నాన్నారు హిమంత. ఈశాన్య రాష్ట్రాలపై ముహమ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి చివరలో ఈశాన్య రాష్ట్రాలు ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని, బంగ్లాదేశ్ మాత్రమే సముద్రాన్ని కాపాడుతుందంటూ అవాకులు పేలారు. నాలుగు రోజుల చైనా పర్యటనలో బంగ్లాదేశ్ వల్ల చైనాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటూ కలరింగ్ ఇచ్చారు. చైనా బంగ్లాదేశ్ వరకు ఆర్థిక కారిడార్ విస్తరించాలని కోరాడు.

యూనస్ ప్రకటన అర్థరహితమని నాడు అసోం సీఎం హిమంత హిస్వా శర్మ ఖండించారు. యూనస్ ప్రకటన అభ్యంతరకరమైనది, తీవ్రంగా ఖండించదగినదని ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. అయితే ఈ సందర్భంగా ఇండియా చికినె నెక్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని హిమంత సూచించారు. చికెన్స్ నెక్ కారిడార్, చుట్టూ మరింత బలమైన రైల్వే, రోడ్డు నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయడం అత్యవసరమని అన్నారు.

చికెన్స్ నెక్‎ను సమర్థవంతంగా దాటేలా ఈశాన్యాన్ని తేలిగ్గా చేరుకునేలా ప్రత్యామ్నాయ రహదారి మార్గాలను అన్వేషించాలని నాడు హిమంత అన్నారు. ఇంజనీరింగ్ సవాళ్లన్నప్పటికీ కలిగిస్తోందని.. ఐతే సంకల్ప బలం, కొత్త ఆవిష్కరణలతో సాధించవచ్చన్నారు. యూనిస్ రెచ్చగొట్టే ప్రకటనలు లోతుగా అధ్యయనం చేయాలని, తేలిగ్గా తీసుకోవద్దని కేంద్రానికి హితువు పలికారు.

చికెన్స్‌నెక్ సిలిగురి కారిడార్ అని కూడా పిలుస్తారు. రోడ్డు లేదా రైలు ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు ఇది కనెక్టింగ్ పాయింట్. ఈ కారిడార్ గుండానే ఎవరైనా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ కారిడార్ కేవలం 20 కిలోమీటర్ల వెడల్పుతో ఉండటమే కాక, భౌగోళికంగా దీని షేప్ కారణంగా చికెన్ నెక్ అంటారు. ఈ స్ట్రిప్ ఉత్తరాన నేపాల్, భూటాన్ దక్షిణాన బంగ్లాదేశ్ ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button