ఆంధ్ర ప్రదేశ్
AP liquor scam case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు

AP liquor scam case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ దూకుడు పెంచింది. కేసిరెడ్డి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు అధికారులు. ఇదిలా ఉండగా రెండోరోజు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ విచారణకు హాజరయ్యారు.
ఇద్దరిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా కస్టడీలోకి తీసుకుంది సిట్. సజ్జల శ్రీధర్ రెడ్డి లిక్కర్ కేసులో ఏ6 గా ఉన్నాడు. నిన్న ధనుంజయ్ రెడ్డి, కృష్ణ మోహన్ను సిట్ 13 గంటల పాటు విచారించింది.