ఆంధ్ర ప్రదేశ్
Jogi Ramesh: రేపు సీఐడీ విచారణకు మాజీమంత్రి జోగి రమేష్

Jogi Ramesh: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్కు ఉచ్చు బిగుస్తోంది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మరోసారి జోగి రమేష్కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రేపు విజయవాడ సీఐడీ రీజనల్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఇదే కేసులో గతంలో మూడుసార్లు విచారణకు హాజరయ్యారు జోగి రమేష్. ఇప్పుడు మళ్లీ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. దీంతో రేపటి విచారణపై ఉత్కంఠ నెలకొంది.