ఆంధ్ర ప్రదేశ్
Kurnool: గౌడుగల్లులో చిరుత పులుల కలకలం

కర్నూలు జిల్లా కోసిగి మండలం గౌడగల్లులో చిరుతల సంచారం కలకలం రేపుతుంది. సమీపంలోని కొండ ప్రాంతాల్లో నుంచి రాత్రి సమయాల్లో గ్రామంలోకి వచ్చేందుకు రెండు చిరుతలు ప్రయత్నించాయి. కుక్కలు మెరగడంతో గమనించిన స్థానికులు కర్రలతో శబ్దం చేస్తూ , బాణ సంచా పేల్చడంతో చిరుతలు కొండల్లోకి వెళ్లాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని పట్టించుకోవాల్సిన ఫారెస్ట్ అధికారులు సలహాలతోనే సరిపెడెతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.



