తెలంగాణ

Kishan Reddy: ఏళ్ల తరబడి పడుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్

Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ జాప్యం వల్లే ప్లైఓవర్​ పనుల్లో ఆలస్యం అవుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్ పేట్‌లోని గోల్నాక ఫ్లైఓవర్ పనులను అధికారులతో కలిసి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా చాదర్​ ఘట్​ నుంచి వరంగల్​‌కు వెళ్లే జాతీయ రహదారి రద్దీగా ఉంటుందని అందుకే ప్రధానితో అడిగి ఫ్లై ఓవర్ మంజూరు చేయించాచమన్నారు.

కానీ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్​ ప్రభుత్వం ఫ్లైఓవర్​ నిర్మాణానికి పూర్తిగా సహకరించడం లేదన్నారు. భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మిగిలిన చోట్ల భూసేకరణ చేసి సహకరించాలని కోరారు. ఈ శివరాత్రి నుంచి ఫ్లైఓవర్​ మీనుంచి ట్రాఫిక్​ వదిలి కింద రోడ్డు నిర్మాణం, బ్యూటిఫికేషన్​ పనులు చేపట్టాలని నేను అధికారులను ఆదేశించాను.

ఈ ఫ్లైఓవర్​కు సంబంధించి నేను గతంలో కేసీఆర్​ కు, ఇప్పుడు రేవంత్​ రెడ్డికి అనేక ఉత్తరాలు రాశాను. భూసేకరణ ను వేగవంతం చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాను. ప్రభుత్వం వెంటనే స్పందించి మిగిలిపోయిన ఆరు చోట్ల భూసేకరణను చేపట్టాలని నేను కోరుతున్నాను. ఈ ఫ్లైఓవర్​ కోసం ఇప్పటి వరకు 338 కోట్లు ఖర్చు చేశామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button