Kishan Reddy: ఏళ్ల తరబడి పడుతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్

Kishan Reddy: రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ జాప్యం వల్లే ప్లైఓవర్ పనుల్లో ఆలస్యం అవుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబర్ పేట్లోని గోల్నాక ఫ్లైఓవర్ పనులను అధికారులతో కలిసి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా చాదర్ ఘట్ నుంచి వరంగల్కు వెళ్లే జాతీయ రహదారి రద్దీగా ఉంటుందని అందుకే ప్రధానితో అడిగి ఫ్లై ఓవర్ మంజూరు చేయించాచమన్నారు.
కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మాణానికి పూర్తిగా సహకరించడం లేదన్నారు. భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మిగిలిన చోట్ల భూసేకరణ చేసి సహకరించాలని కోరారు. ఈ శివరాత్రి నుంచి ఫ్లైఓవర్ మీనుంచి ట్రాఫిక్ వదిలి కింద రోడ్డు నిర్మాణం, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని నేను అధికారులను ఆదేశించాను.
ఈ ఫ్లైఓవర్కు సంబంధించి నేను గతంలో కేసీఆర్ కు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనేక ఉత్తరాలు రాశాను. భూసేకరణ ను వేగవంతం చేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాను. ప్రభుత్వం వెంటనే స్పందించి మిగిలిపోయిన ఆరు చోట్ల భూసేకరణను చేపట్టాలని నేను కోరుతున్నాను. ఈ ఫ్లైఓవర్ కోసం ఇప్పటి వరకు 338 కోట్లు ఖర్చు చేశామన్నారు.