తెలంగాణ
రైతు పొలానికి వెళ్తుంటే ఎదురైన పులి.. భయందోళనలో ప్రజలు

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో పెద్దపులి సంచారం కలకలం రేగింది. రైతు పొలానికి వెళ్తుండగా పెద్దపులి కంట పడింది. దీంతో పెద్దపులి ఏక్షణాన దాడి చేస్తుందోనని రైతులంతా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పెద్దపులి పాదముద్రల ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.
పెద్దపులి జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్న అధికారులు కుంటలు, వాగుల వద్ద పాదముద్రలను గుర్తించారు. నిన్న పూస్కుపల్లి ఇసుక క్వారీ వద్ద పులి అడుగులను చూశారు. గతేడాది ఇదే ప్రాంతంలో సంచరించిన పులి ఇప్పుడు కాటారం, మహదేవపూర్ మండలాల్లోని అడవుల్లో గత పది రోజులుగా సంచరిస్తోంది.