తెలంగాణ
Warangal: వైద్యం వికటించి మహిళ మృతి

Warangal: వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో చోటు చేసుకుంది. వర్ధన్నపేటలోని లక్ష్మీగణపతి ప్రైవేట్ ఆస్పత్రిలో రజిత అనే మహిళకు రెండ్రోజుల క్రితం డాక్టర్ రాజ్కుమార్ గర్భసంచి ఆపరేషన్ చేశారు.
జనరల్ వార్డులో చికిత్స పొందుతూ రజిత మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు శవంతో ఆస్పత్రిలోనే ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యం వహించిన డాక్టర్ రాజ్కుమార్పై కేసు నమోదు చేసి..ఆస్పత్రిని సీజ్ చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.