ఆంధ్ర ప్రదేశ్

Srisailam: శ్రీశైలంలో వైభవంగా రెండవరోజు ఉగాది మహోత్సవాలు

Srisailam: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రెండవరోజు కన్నులపండువగా జరిగాయి. ఉత్సవాల రెండవ రోజులో భాగంగా మహాదుర్గ అలంకారంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాదుర్గ అలంకార రూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనం శ్రీస్వామివారికి అర్చకులు వేదపండితులు, ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూరహారతులిచ్చారు.

అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ముందు కన్నడ నృత్యాలు,గురవయ్య నృత్యాలు, పులి బొమ్మల వేషాలు, కోలాటాలు, కన్నడిగుల నృత్యాలు, బ్యాండు వాయిద్యాలతో నడుమ స్వామి అమ్మవార్లు శ్రీశైల క్షేత్రపురవీధుల్లో విహరించారు ఆలయ ఉత్సవం ముందు భక్తులు బక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు కన్నడ భక్తిలనడుమ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించారు ఈ పూజ కార్యక్రమలు వాహనసేవలలో ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, అధికారులు పెద్దఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button