ఆంధ్ర ప్రదేశ్
Bhadrachalam: భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు సర్వం సిద్ధం

Bhadrachalam: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి శ్రీరామనవమి వేడుకలకు దేవాదాయ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు . సీతారాముల కళ్యాణ వేడుకను వీక్షించడానికి సుమారు లక్షకు పైగా భక్తులు భద్రాచలం రానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్ల నడుమ కళ్యాణ వేడుక వీక్షించేలా అన్ని ఏర్పాట్లు చేశారు.
గ్యాలరీని 26 సెక్టార్లుగా విభజించి భక్తులకు వీవీఐపీలకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు త్రాగునీరు ఉచిత వసతి ప్రాథమిక చికిత్స కేంద్రాలు,లడ్డూ ప్రసాదాల కౌంటర్లు 20, ముత్యాల తలంబ్రాల కౌంటర్లు 80,23 చికిత్సా కేంద్రాలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తీసుకుని రానున్న నేపథ్యంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు.