Naga Vamsi: 2026లో బుద్ధి చెప్తా”.. నాగ వంశీ ఫైర్!

Naga Vamsi: వరుస ఫ్లాపులతో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న నిర్మాత నాగ వంశీ కొత్త సినిమా ప్రకటించారు. ‘ఎపిక్’ అనే లవ్ స్టోరీతో వస్తున్నట్లు చెప్పిన ఆయన 2026లో ట్రోలర్స్ను సైలెంట్ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సితార ఎంటర్టైన్మెంట్స్ నాగ వంశీ గత కొన్ని చిత్రాలతో వరుస ఫ్లాపులు చవిచూశారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై భారీ ట్రోలింగ్ జరిగింది. అయినా వెనక్కి తగ్గని నాగ వంశీ మరో కొత్త చిత్రం ప్రకటించారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లవ్ స్టోరీకి ‘ఎపిక్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమాకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ సందర్భంగా నాగ వంశీ మీడియాతో మాట్లాడారు. “2026లో నేను నిర్మించే సినిమాలతో అందరికీ సమాధానం చెబుతాను. ఎవరికీ నన్ను ట్రోల్ చేసే అవకాశం ఇవ్వను. ట్రోలర్స్ అందరినీ సైలెంట్ చేస్తాను” అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.



