ఆంధ్ర ప్రదేశ్
Kurnool: అడవిదున్న సంచారంతో గ్రామస్తుల భయాందోళనలు

Kurnool: కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని కుంకునూరులో అడవిదున్న ప్రత్యక్షమైంది. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏక్షణాన ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
ఈ అడవిదున్నలు నల్లమల్లలో అరుదుగా కనిపిస్తాయంటున్న జనం.. వందల కిలోమీటర్ల నుండి ఎలా వచ్చిందంటూ..? చర్చిస్తున్నారు. అయితే అడవిదున్న ఒక్కటే వచ్చిందా..? లేక మందలుగా వచ్చాయా అనే అంశంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అడవిదున్నసంచారంపై గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు.