ఆంధ్ర ప్రదేశ్
Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణికి హైకోర్టులో చుక్కెదురు

Kakani Govardhan Reddy: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణికి హైకోర్టులో చుక్కెదురు అయింది. రుస్తుం మైనింగ్ కేసులో ఏ-4గా ఉన్న కాకాణి గోవర్దన్ రెడ్డిని అరెస్టు నుంచి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో పరారీలో ఉన్న మాజీ మంత్రి కాకాణి సాయంత్రం నెల్లూరుకు వచ్చే అవకాశం కన్పిస్తోంది.
అక్రమ మైనింగ్ కేసులో ఇప్పటికే హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని, కాకాణి నివాసానికి వెళ్లి పొదలకూరు పోలీసులు నోటీసులు అందించారు. విచారణకు రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. అంతకుముందు ఏపీలో కూడా నోటీసులు అందించారు. కానీ కాకాణి రెండు సార్లు పోలీసు విచారణకు హాజరుకాలేదు. మరోవైపు విచారణకు హాజరుకాకపోతే చట్టపరంగా ముందుకు వెళ్తామన్నారు పోలీసులు.