తెలంగాణ
Achampet: అచ్చంపేటలో ఉద్రిక్తత.. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ భర్త మల్లేష్పై రైతుల దాడి

Achampet: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ భర్త మల్లేష్పై రైతులు దాడికి దిగారు. ఆఫీసుల కిటికీలు, అద్దాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని.. మల్లేష్ను ఆఫీసు లోపలకి పంపించారు. రైతులు అంతటితో ఆగకుండా.. నాగర్ కర్నూలు-శ్రీశైలం రహదారిపై బైఠాయించి.. వేరుశనగకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.