అంతర్జాతీయం
Pakistan: పాకిస్తాన్లోని బలూచిస్ధాన్లో పేలుడు.. 11 మంది కార్మికులు మృతి

Pakistan: పాకిస్తాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో మరోసారి పేలుడు చోటుచేసుకుంది. బొగ్గు గని కార్మికులు వెళ్తున్న వాహనం లక్ష్యంగా బాంబు పేలుడు జరగడంతో 11 మంది మృతి చెందారు. కార్మికులతో వెళ్తున్న పికప్ వాహనంపై పేలుడు పదార్థంతో దాడి చేశారు.
ఈ దాడిలో 11 మంది అక్కడికక్కడే మరణించారు. 25 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. ఇంతకు ముందు కూడా ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.