Indian Army: పాకిస్తాన్ దాడులపై భారత ఆర్మీ పోస్టు

Indian Army: పాకిస్తాన్ దాడులపై భారత ఆర్మీ పోస్టు చేసింది. భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లతో దాడులకు పాల్పడిందని పోస్టులో పేర్కొంది. జమ్ముకశ్మీర్ నియంత్రణ రేఖ వెంబడి పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘించిందని తెలిపింది. అయితే.. పాక్ మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశామని భారత ఆర్మీ పోస్టులో తెలియజేసింది.
పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను నిర్వీర్యం చేశామన్న భారత ఆర్మీ, భారత్ వైపు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించింది. దేశ సార్వభౌమత్వం, ప్రజల భద్రత పరిరక్షణకు పూర్తి సిద్ధంగా ఉన్నట్లు రక్షణశాఖ తెలిపింది.
కాసేపట్లో రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగనుంది. సీడీఎస్, త్రివిధ దళాల అధిపతులతో రాజ్నాథ్ సింగ్ భేటీకానున్నారు. పాకిస్తాన్ షెల్లింగ్, సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించనున్నారు.