ఆంధ్ర ప్రదేశ్
Nandyala: అగ్నిప్రమాదం.. చెంచు గుడిసెల్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

Nandyala: అందరూ ఆనందంగా గడపాల్సిన భోగి పండగ రోజున వారికి అనుకోని కష్టం ఎదురైంది. అగ్ని ప్రమాదం జరిగి సర్వం కాలిపోవడంతో.. వీధిన పడాల్సి వచ్చింది. నంద్యాల జిల్లా శ్రీశైలం శఖరేశ్వరంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. రెండు చెంచు గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో.. రెండు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు.