ఆంధ్ర ప్రదేశ్
MLC Nagababu: మండలిలో ఎమ్మెల్సీగా నాగబాబు తొలి స్పీచ్

MLC Nagababu: ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగబాబు తొలిసారిగా శాసనమండలిలో ప్రసంగించారు. రాష్ట్రంలో లక్షకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. అధికారంలో ఉన్న కొంత మంది తమ అవసరాల కోసం జ్యుడిషియల్ సిస్టమ్ను వాడుకుంటున్నారని అన్నారు.
ఒక్కసారి కేసు నమోదయితే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేరని, బ్యాక్గ్రౌండ్ వేరిఫికేషన్లో ఫెయిల్ అవుతున్నారని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. రాజకీయ కక్ష్యలతో పెట్టిన కేసుల వల్ల సామాన్యులు జీవితాలు తారుమారు అవుతున్నాయి. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసుల విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు.



