ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ అవసరం

Chandrababu: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరఫున ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేశారు. జ్యోతిని వెలిగించి ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మంత్రులు కందుల దుర్గేష్, ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఉగాది పచ్చడిని నేతలు స్వీకరించారు. వేడుకల సందర్భంగా పలువురు కళాకారులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పండితులు మాడుగుల నాగఫణిశర్మ పంచాంగ శ్రవణం చేశారు