తెలంగాణ

కాగ్నానది బ్రిడ్జికి భారీ రంద్రం

వికారాబాద్ జిల్లా తాండూరులో కాగ్నానదికి భారీ రంధ్రం పడింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించిన రెండేళ్లకే ఈ ఘటన జరిగింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన వంతెనలు వందేళ్లు ఉండాల్సినవి ప్రారంభించిన రెండేళ్లకే భారీ రంద్రాలు పడి శిథిలావస్థకు చేరడం ఇటీవల పరిపాటిగా మారింది.

తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో మహబూబ్నగర్ – తాండూరు అంతర్ జిల్లాను కలిపే రోడ్డు మార్గంలో కాగ్నా నది పై రూ. 16 కోట్ల 80 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభించిన రెండేళ్లకే భారీ రంద్రం పడింది. దీంతో ఆ బ్రిడ్జిపై నుండి వెళ్లే భారీ వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

వందేళ్లు ఉండాల్సిన వంతెనలు ఇలా ప్రారంభించిన రెండేళ్లకే శిథిలావస్థకు చేరడం పట్ల కాంట్రాక్టర్ నాసిరకం పనులు చేపట్టడమే కారణం అంటున్నారు. నాసిరకం పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌పై తగిన చర్యలు తీసుకొని వెంటనే కాగ్నా నది బ్రిడ్జికి మరమ్మత్తులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button