జాతియం

చీరకొంగు చించి సీఎంకు రాఖీ కట్టిన మహిళ

Uttarakhand: ఇటీవల ఉత్తరాఖండ్ లోని ధారాలిలో క్లౌడ్ బరస్ట్ కావడంతో భారీ ఆకస్మిక వరదలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడి, రాళ్లు, బురద ఊరు మొత్తాన్ని తుడిచిపెట్టేశాయి. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ ఘటనపై తక్షణమే స్పందించి, వేగంగా సహాయకచర్యలు అందేలా చర్యలు తీసుకున్నారు.

దీంతో బురదలో చిక్కుకుపోయిన వందలమంది గ్రామస్తులను విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. ప్రమాదం జరిగిన ధారాలితో సహా పలు గ్రామాల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామీ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డ అహ్మదాబాద్‌కు చెందిన యాత్రికురాలు ధన్‌గౌరీ బరోలియా, సీఎం ధామీకి కృతజ్ఞతగా తన చీరకొంగు చించి రాఖీగా కట్టింది.

రాఖీ కడుతున్నప్పుడు, ఆమె భావోద్వేగానికి గురై, నాకు ముఖ్యమంత్రి ధామి శ్రీకృష్ణుడి లాంటివాడు, ఆయన నన్ను మాత్రమే కాకుండా ఇక్కడ ఉన్న తల్లులు సోదరీమణులందరినీ ఒక సోదరుడిలా రక్షించారు. ఆయన మూడు రోజులుగా మన మధ్య నివసిస్తున్నారు, మన భద్రత మన అవసరాలను చూసుకుంటున్నారని అన్నారు.

అది కేవలం ఒక గుడ్డ ముక్క కాదు, ఒక సోదరి తనను రక్షించే తన సోదరుడి పట్ల ఆమెకున్న విశ్వాసం, ఆప్యాయత, అచంచలమైన ప్రేమతో నిండి ఉంది. ముఖ్యమంత్రి ధామి కూడా ఆమె చేయి పట్టుకుని, ఒక సోదరుడిగా, ప్రతి పరిస్థితిలోనూ విపత్తులో ప్రభావితమైన సోదరీమణులకు తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ అనుకోని హృదయాన్ని హత్తుకునే సంఘటనతో సీఎం సహా అక్కడివారంతా భావోద్వేగానికి గురయ్యారు. స్వయంగా శ్రీకృష్ణుడే ధామి రూపంలో వచ్చి తన చెల్లెళ్లను రక్షించాడని ధన్‌గౌరీ కన్నీటి పర్యంతం అయింది. ఆగస్టు 5న జరిగిన ఆ ప్రమాదంలో రాష్ట్ర ప్రభుత్వం, NDRF, SDRF, భారత సైన్యం, ITBP బృందాలు విపత్తు బాధితులను కాపాడడానికి హెలికాప్టర్లతో సహా వేగవంతమైన రక్షణ కార్యకలాపాలు చేపట్టడంతో భారీగా ప్రాణనష్టాన్ని నివారించగలిగారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button