జాతియం
Tamil Nadu: బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

Tamil Nadu: తమిళనాడు విరుద్నగర్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సాతూరులోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు.
బాణసంచా పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. సమీపంలోని 6 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.