ఆనంద్-వైష్ణవి కాంబోలో మరో హిట్ లోడింగ్..!

టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘బేబీ’ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి తెరపై మ్యాజిక్ చేయనున్నారు.
‘బేబీ’ సినిమాతో యూత్లో క్రేజ్ సృష్టించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీ మరో రొమాంటిక్ ఎంటర్టైనర్తో రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సిరీస్ #90s దర్శకుడు ఆదిత్య హాసన్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్తో పాటు సెట్స్లోని ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ సినిమా ప్రేమకథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. హేషమ్ అబ్దుల్ వాహబ్ సమకూర్చిన మ్యూజిక్ సినిమాకు మరింత ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు టీమ్ కసరత్తు చేస్తోంది. ఈ సినిమాతో ఆనంద్-వైష్ణవి జంట మరో బ్లాక్బస్టర్ అందిస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.