తెలంగాణ
Mahipal Reddy: కాంగ్రెస్ నేతల దాడిని ఖండించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Mahipal Reddy: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని… ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతల దాడి దుర్మార్గం అన్నారు. దాడికి సపోర్ట్ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు. కాటా శ్రీనివాస్ మూడుసార్లు ఓడినా సిగ్గులేదన్నారు.
పటాన్ చెరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సహకరించాల్సింది పోయి.. వ్యతిరేక కార్యక్రమాలు చేయడం మంచిదికాదని హెచ్చరించారు. క్యాంప్ కార్యాలయం దాడిపై జిల్లా ఎస్పీ, ఐజీలతో పాటు.. కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు మహిపాల్ వెల్లడించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారాయన.