ఆంధ్ర ప్రదేశ్
జగన్ పర్యటన.. వైసీపీ కార్యకర్త మృతి.. సీసీ ఫుటేజీలో రికార్డు

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నిన్న వైసీపీ కార్యకర్త మృతి చెందాడు. వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లి పర్యటన సందర్భంగా వచ్చిన వైసీపీ కార్యకర్త ఉన్నట్టుండి సత్తెనపల్లి గడియార స్తంభం వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు వ్యక్తి. బాధితుడు జయవర్ధన్ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయింది.