తెలంగాణ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన శ్రవణ్రావు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగమైంది. ఇవాళ మరోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు శ్రవణ్రావు. జూబ్లీహిల్స్ పీఎస్లో మూడోసారి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యాడు శ్రవణ్ రావు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. గత ఎన్నికల సమయంలో వాడిన సెల్ఫోన్లు ఇవ్వాలని ఇప్పటికే శ్రవణ్రావుకు నోటీసులు జారీ చే యగా, రెండోసారి హాజరైన సమయంలో శ్రవణ్ రావు తుప్పుపట్టిన మొబైల్స్ తమకు ఇచ్చినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. విచారణకు సహకరించకుండా శ్రవణ్ రావు తప్పించు కునే ప్రయత్నమంటోంది సిట్. ఇక ఇవాళ్టి విచారణ పూర్తయిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కన్పిస్తోంది.