ఆంధ్ర ప్రదేశ్
AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో తెరపైకి మరో పేరు

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో తెరపైకి మరో పేరు వచ్చింది. బియాండ్ కాఫీ అధినేత బాలం సుధీర్ పేరు వచ్చింది. రాజ్ కసిరెడ్డికి బాలం సుధీర్ అత్యంత సన్నిహితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. బాలం సుధీర్కు కసిరెడ్డి 50కోట్ల రూపాయలు అందించినట్టు గుర్తించారు.
సుధీర్ను అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కసిరెడ్డిని సిట్ విచారిస్తుంది.ఈ విచారణ సందర్భంగా పలువురి పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. నిన్న రాత్రి నుంచి కసిరెడ్డిని సిట్ చీఫ్ రాజశేఖర్ విచారిస్తున్నారు.