క్రీడలు

IND-AUS: బాక్సింగ్ డే టెస్టుపై పట్టుబిగిస్తోన్న భారత్

IND-AUS: మరోవైపు.. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా.. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సరికొత్త రికార్డ్ సాధించారు. అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్‌గా నిలిచారు. ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన తర్వాత బుమ్రా ఈ ఘనత సాధించారు.

కెరీర్‌లో 44వ టెస్టు ఆడుతున్న బుమ్రా.. కేవలం 8 వేల 484 బంతుల్లో.. 200పైగా వికెట్ల మార్క్‌ను అందుకొన్నారు. ఈ జాబితాలో పాక్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 7,725 బంతుల్లో తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే, మ్యాచుల పరంగా స్పిన్నర్ అశ్విన్ భారత్‌ తరఫున ముందున్నాడు. 37 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button