ఆంధ్ర ప్రదేశ్

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ పర్యటన ఖరారు

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి రానున్నారు. ఈ నెల 8న మోడీ విశాఖలో పర్యటించనున్నారు. జనవరి 8 సాయంత్రం 4 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారు. సిరిపురం నుంచి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజి మైదానం వరకు నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు.

అనంతరం, ఏయూ ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్ లో నిర్వహించే భారీ సభలో పాల్గొంటారు. ఈ సభ గంట పాటు జరగనుంది. ఏపీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం అదే రోజు రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి భువనేశ్వర్ బయల్దేరనున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button