తెలంగాణ
మద్యం మత్తులో యూట్యూబర్స్పై దాడి

మద్యం మత్తులో యూట్యూబర్స్పై దాడి జరిగింది. సిరిసిల్ల జిల్లా నర్సింగాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఫోక్ సాంగ్ చిత్రీకరణ పూర్తయిన తర్వాత.. చందుర్తి మండలం నర్సింగాపూర్లోని బంధువు ఇంటికి వెళ్లారు యూట్యూబర్స్. అక్కడే ఈ వివాదం రాజుకుంది.
గజ్వేల్, కరీంనగర్, జగిత్యాల, సిద్ధిపేట వివిధ ప్రాంతాలకు చెందిన యువతులతో ఫోక్ సాంగ్ చిత్రీకరణ పూర్తి చేశారు. అయితే రాత్రి కావడంతో నర్సింగాపూర్లోని బంధువుల ఇంటికి విడిది కోసం వెళ్లారు యూట్యూబర్స్. రాత్రి తిన్న తర్వాత ఇంటి ముందు కూర్చుని ఉండగా స్థానికులు గంగాధర్తోపాటు మరో ఇద్దరు యువకులు, యూట్యూబర్స్పై దాడి చేశారు. అం తేకాదు యువతుల పట్ల మందుబాబులు అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.