ఆంధ్ర ప్రదేశ్
Eluru: లారీని ఢీకొట్టిన మరో లారీ.. ఇద్దరు మృతి

Eluru: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉంగుటూరు మండలం నాచుగుంట దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సాంకేతిక కారణాలతో నిలిచిన లారీని డ్రైవర్ పరిశీలిస్తుండగా.. వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది. ఘటనలో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతులను హనుమాన్ జంక్షన్ వాసులుగా గుర్తించారు.