తెలంగాణ
Vikarabad: విషాదం.. కిటికీ మీదపడి మూడేళ్ల చిన్నారి మృతి

Vikarabad: వికారాబాద్ జిల్లా పరిగిలోని వేంకటేశ్వర కాలనీలో విషాదం చోటుచేసుకుంది. మూడేళ్ల చిన్నారి సోన ప్రమాదవశాత్తు కిటికీ మీదపడి మృతి చెందింది. తల్లి కూలి పనిలో నిమగ్నమై ఉండగా ఆడుకుంటు ఉన్న చిన్నారి బిగించడానికి సిద్ధంగా ఉన్న కిటికీని తోయడంతో అది ఆమె తలపై పడింది. తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం జరగడంతో హుటాహుటిన పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చే లోపే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు.