ఆంధ్ర ప్రదేశ్

PV Sindhu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు దంపతులు

PV Sindhu: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు దర్శించుకున్నారు. తన భర్త , ఇతర కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న సింధు దంపతులకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్భంగా సింధు దంపతులు స్వామి వారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button