ఆంధ్ర ప్రదేశ్
పండగ పూట విషాదం.. ఆత్మహత్య చేసుకున్న కుటుంబం

పండగ పూట శ్రీ సత్యసాయి జిల్లా విషాదం చోటు చేసుకుంది. మడకశిరలో ఇద్దరు పిల్లలతో సహా తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంతోషంగా పండగ చేసుకోవాల్సిన సమయంలో ఈ కుటుంబానికి ఏ కష్టం వచ్చిందో కానీ ఉగాది రోజున ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు గోల్డ్ స్మిత్ కృష్ణచారి కుటుంబంగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.