Suicide: కన్నీళ్లు పెట్టిస్తున్న యువతి సూసైడ్ నోట్

Suicide: ఇవాళ వాళ్లిద్దరిది పెళ్లి.. ఇరు కుటుంబాలు.. అన్ని ఏర్పాట్లు చేశారు. బంధువులతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. అంతలోనే.. ఓ వార్త వారందరినీ విషాదంలో ముంచింది. ఏమైందో ఏమోగానీ యువతి సూసైడ్ నోట్ రాసి.. ఆత్మహత్యకు పాల్పడింది. ఇప్పుడు ఆ నోట్ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.
నిన్న తిరుపతి జిల్లా పంబలేరు వాగులో యువతి డెడ్ బాడీ లభ్యమైంది. స్థానిక ఆదిశంకర కాలేజలో బీటెక్ సెకండియర్ చదువుతోంది ఆమె. అయితే.. చైతూ అనే యువకుడితో యువతికి ఇవాళ పెళ్లి జరగాల్సి ఉంది. దానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇరు కుటుంబాలు. కాగా.. పది రోజుల క్రితమే ఇంటి నుంచి కాలేజీకి వెళ్లిన యువతి.. పెళ్లి కోసం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో.. పోలీసులకు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు.
పంబలేరు వాగులో మృతదేహం లభ్యమైంది. ఐడీ కార్డు బట్టి ఆమె తప్పిపోయిన యువతిగా పోలీసులు గుర్తించారు. మరోవైపు.. యువతి సూసైడ్ నోట్ కూడా లభ్యమైంది. చైతూ బావ నీకు పుట్టే బిడ్డకి నా పేరు పెట్టండంటూ రాసింది.
ఆదిశంకర కాలేజీ యాజమాన్యంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు కాలేజీకి రాకుంటే.. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు పేరెంట్స్.