జాతియం

Railway Station Stampede: ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు ముమ్మరం

Railway Station Stampede: ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ద్విసభ్య కమిటీ క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తోంది. ఇప్పటికే రైల్వేశాఖ ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. మరోవై పు ఢిల్లీ పోలీసులు సీసీఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఘటనలో ఇప్పటివరకు 18 మంది మృతి చెందగా 30 మందికి తీవ్ర గాయాలైనట్లు వెల్లడించారు.

ప్రయోగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన రైళ్ల పేర్లు ఒకేలా ఉండటంతో ప్రయాణికులు అయోమయానికి గురైనట్లు అధికారులు చెబుతున్నారు. ఫ్లాట్‌ఫ్లాం నెంబరు ప్రకటించడంతో సీన్ మారిందంటు న్నారు. ఫుట్ ఓవర్ బిడ్జ్రి పైనుండి వచ్చిన జనం మెట్లమీద ఉన్నవారిని తోయగా వారు జారిపడటంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మృతుల్లో 14 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నట్లు వెల్లడించారు.

కుంభమేళాకు వెళ్లేవారి కోసం గంటకు 1,500 జనరల్ టికెట్ల చొప్పున జారీ చేయడంతో వారంతా ప్లాట్‌ఫాంలపైకి చేరుకున్నారు. ఇదీ స్టేషన్లో రద్దీకి కారణమైంది. స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ సిబ్బంది కొరత ఉన్నట్లు ద్విసభ్య కమిటీ గుర్తించింది. అయితే సిబ్బందిని కుంభమేళా విధులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. మొత్తానికి పెరిగిన రద్దీతోనే ఘటన జరిగినట్లు అధికారులు అంచనాకు వచ్చారు.

మృతులంతా బిహార్, ఢిల్లీ వాసులుగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ ఘటనపై స్పందించిన బిహార్ ప్రభుత్వం తొక్కిసలాట బాధితులకు పరిహారం ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకు 2లక్షల రూపాయలు ప్రకటించారు సీఎం నితీష్ కుమార్. గాయపడిన వారికి 50వేల ఆర్ధికసాయం అందజేస్తామని చెప్పారు.

అటు ఢిల్లీ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రైల్వేశాఖ కూడా ఎక్స్‌గ్రేషియో ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తీవ్ర గాయాలైనవారికి 2లక్షల 50వేల చొప్పున పరిహారం మైనర్ గాయాలైనవారికి లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియో ప్రకటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button