ఆంధ్ర ప్రదేశ్
Guntur Mayor: గుంటూరు మేయర్గా కోవెలమూడి రవీంద్ర

Guntur Mayor: గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. మేయర్ పదవికి కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. 51 మంది కౌన్సిల్ సభ్యులు ఓటు వేయగా ఏడు గురు ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొన్నారు.
రవీంద్రకు అనుకూలంగా 34 మంది ఓటు వేయగా, వైసీపీ అచ్చాల వెంకరెడ్డికి 27 ఓట్లు పడ్డాయి. మొత్తం సభ్యుల సంఖ్య 63. అయితే ఇందులో గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది. గుంటూరు మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకోవడంతో తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు.