రాజ్న్యూస్ ఛైర్మన్ లక్ష్మీరావుకు భారత్ కి అన్ మోల్ అవార్డు

అవరోధాలను అధిగమించి పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు సినీనటి, జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కుష్బూ. హైదరాబాద్లో జరిగిన భారత్ కి అన్ మోల్ అవార్డు ప్రదానోత్స కార్యక్రమంలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్తో పాట కుష్బూ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మహిళకు అవార్డులు అందించారు కుష్బూ. ప్రతి రంగంలోనూ మహిళలు ఎన్నో ఒత్తిళ్లను, సవాళ్లను ఎదుర్కోవల్సి వస్తోందన్నారు. ఒక మహిళ ఉన్నత స్థానానికి చేరిందంటే దాని వెనుక ఆమె ఎన్నో కష్టాలను దాటుకుని రావలసి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
రాజ్న్యూస్ ఛైర్మన్ లక్ష్మీరావుకు భారత్ కి అన్మోల్ ఉమెన్ అచీవర్ అవార్డును స్పీకర్ ప్రసాద్తో కలిసి కుష్బూ అందించారు. సంప్రదాయ నృత్యంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన పద్మజారెడ్డి, ప్రముఖ వీణా ప్లేయర్ వీణాశ్రీవాణి, ప్రకృతి వ్యవసాయంపై యువతకు అవగాహన కల్పిస్తున్న మాగంటి రూపా, న్యాయ శాస్త్రంలో డాక్టరేట్ పొందిన చంద్రమతితో పాటూ పలువురు ప్రముఖులు భారత్ కి అన్మోల్ ఉమెన్ అచీవర్స్ అవార్డు అందుకున్నారు.