ఆంధ్ర ప్రదేశ్
విశాఖలో పెరిగిన ట్రాఫిక్ కష్టాలు

Visakha: రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖపట్నం అని అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్నా ఇప్పటికీ ట్రాఫిక్ కష్టాలు తీరటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో భారీ వాహనాలు తిరగటంతో చాలా మంది వాహనాల చక్రాలు కింద పడి ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు వాపోతున్నారు. పోలీస్, జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో నూరేళ్ళు ఉండాల్సిన జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు ప్రజలు.