Kaliyugam 2064: దూసుకుపోతున్న ‘కలియుగమ్ 2064’ ట్రైలర్

Kaliyugam 2064: సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘కలియుగమ్ 2064’ ట్రైలర్ సంచలనం సృష్టిస్తోంది. హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో, సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అయింది.
‘జెర్సీ’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ లాంటి హిట్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్దా శ్రీనాథ్ నటించిన ‘కలియుగమ్ 2064’ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. 2064 నేపథ్యంలో మానవాళి మనుగడ పోరాటాన్ని చూపిస్తూ, పౌరాణిక ఇతివృత్తాలను గుర్తుచేసే ఈ చిత్రాన్ని ప్రమోద్ సుందర్ డైరెక్ట్ చేశారు.
కె.ఎస్. రామకృష్ణ నిర్మాణంలో, మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా మే 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది. ట్రైలర్లో విజువల్ ఎఫెక్ట్స్, కె.రాంచరణ్ సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి.
రాంగోపాల్ వర్మ ట్రైలర్ను లాంచ్ చేస్తూ, “ఫ్యూచరిస్టిక్ ఎక్స్పీరియన్స్, మోడరన్ వైబ్ ఉన్న సినిమా అందరూ తప్పక చూడాలి” అని ప్రశంసించారు. మణిరత్నం లాంచ్ చేసిన ఫస్ట్ లుక్కు ఇప్పటికే భారీ ఆదరణ లభించింది. సమ్మర్ స్పెషల్గా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందించనుంది.