ఆంధ్ర ప్రదేశ్
Kurnool: కర్నూలు జిల్లాలో దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి

Kurnool: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. బైక్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ఘటన జరిగింది.
ఎమర్జెన్సీ డోర్ నుంచి 12 మంది ప్రయాణికులు బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి బస్సు బెంగళూరు వెళ్తుండగా తెల్లవారుజామున మూడున్నరకు ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.



