ఆంధ్ర ప్రదేశ్

Anam Ramanarayana Reddy: ఏప్రిల్ 30న చందనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం

Anam Ramanarayana Reddy: సింహాచలం అప్పన్న చందనోత్సవంఏర్పాట్లపై నలుగురు మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 30న చందనోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు ప్రభుత్వ తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారని మంత్రి ఆనం తెలిపారు.

వైసీపీ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆలయాలను పట్టించుకోలేదని, చందనోత్సవానికి ఈసారి చిన్న పొరపాటు కూడా జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆలయ ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందన్నారు. చందనోత్సవానికి ఉచిత బస్సు ప్రయాణం నిరంతరంగా ఉంటుందని మంత్రి ఆనం తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button