తెలంగాణ
ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం

ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు జేఏసీ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గద్దర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని జేఏసీ అధ్యక్షుడు వలిగొండ నర్సింహ డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్కు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా చేయాలని చేసే కుట్రలో భాగంగానే బండి సంజయం ఈ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వారికి అనుకూలంగా ఉన్నవారికి, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారికి అవార్డులు ఇచ్చిందన్నారు. కానీ ప్రజాయుద్ధ నౌక గద్దర్ అనే వ్యక్తి బీజేపీ ఇచ్చే అవార్డుల కన్నా గొప్పవారన్నారు. ఇప్పటికైనా బండి సంజయ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యాలయాలన్నీ ముట్టడిస్తామని హెచ్చరించారు.