ఆంధ్ర ప్రదేశ్
TTD: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనం

TTD: తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని కల్పించనుంది టీటీడీ . ఈ విధానం ఈనెల 24నుండి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతిచ్చింది. కాగా సోమ, మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు బుధవారం, గురువారం 300 రూపాయల ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఇక ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతిచ్చింది టీటీడీ. అలాగే సిఫార్సు లేఖపై ఆరుగురికి దర్శనం కల్పించింది.