తెలంగాణ
Mahesh Kumar Goud: దేశ సమగ్రతను మోడీ, అమిత్ షా దెబ్బతీస్తున్నారు

Mahesh Kumar Goud: రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జై బాపు.. జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే శంకరయ్య పాల్గొన్నారు. దేశ సమగ్రతను ప్రధాని మోడీ, అమిత్ షా దెబ్బతీస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.
రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ పదేళ్ల కాలంలో దేశానికి ఏం చేశారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. ప్రపంచ దేశాలు గౌరవిస్తున్న మన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేస్తుందన్నారు.