తెలంగాణ
నిజామాబాద్ జిల్లాలో మండుతున్న ఎండలు

నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగలకు జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. గత వారం రోజులుగా జిల్లాలో 40కి పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా వేడిగాలులు, ఉక్కపోత నగర వాసులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మరో వైపు మధ్యాహ్నం సమయంలో బయటికి రావోద్దని వైద్యులు సూచిస్తున్నారు.