తెలంగాణ
KTR: నిందలు, దందాలు, చందాలు.. ఇదే కాంగ్రెస్ పాలన

KTR: నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ ఎప్పుడో పోయిందని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం నిందలు, దందాలు, చందాల పాలన నడుస్తుందని కేటీఆర్ విమర్శించారు. దేశంలో ఏ మంత్రి పని చేయని విధంగా తక్కువ కాలంలోనే ప్రాజెక్ట్లు పూర్తి చేసిన ఘనత హరీష్రావుది అని కేటీఆర్ కొనియాడారు.
సుంకిశాల, ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన కేంద్ర బృందాలు ఇప్పటి వరకు రాలేదన్నారు. మేడిగడ్డలో చిన్న పిల్లర్ కూలితే రాద్ధాంతం చేస్తోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కమిషన్ పేరిట రాజకీయాలు నడుస్తున్నాయన్నారు.