తెలంగాణ
Revanth Reddy: కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం

Revanth Reddy: సీఎం రేవంత్ అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరుగనుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
భట్టి, ఉత్తమ్, పొంగులేటి, పలువురు అధికారులకు పథకాల అమలుపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ ప్రకటించిన పథకాల్లో.. రేపటి నుంచి నాలుగు పథకాలు అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో నేటి సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.