తెలంగాణ
MLC Kavitha:పెద్దగట్టు లింగమంతుల స్వామివారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: సూర్యాపేట జిల్లాలో పెద్దగట్టు లింగమంతుల స్వామివారికి ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించి మొక్కులు అప్పజెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్,నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి,బడుగుల లింగయ్య యాదవ్ స్వామివారిని దర్శించుకున్నారు. లింగమంతుల స్వామివారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు కవిత.
సమ్మక్క, సారలమ్మ జాతర తరువాత ఇది రెండో అతిపెద్ద జాతర అన్నారు. తెలంగాణ హయాంలో 14 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని రానున్న రోజుల్లో ఆలయ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు కవిత.