ఆంధ్ర ప్రదేశ్

Chandrababu: దసరా ఉత్సవాలకి సీఎంకు ఆహ్వానం

Chandrababu: దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆహ్వానించారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై జరగనున్న దసరా ఉత్సవాలకు రావాల్సిందిగా క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు.

ఈ సందర్భంగా అర్చకులు సీఎంను ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్,దుర్గ గుడి ఈవో శీనా నాయక్. ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, శివప్రసాద్, వేద పాఠశాల అర్చకులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button